TG : పౌరసత్వంపై మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కు ఎదురుదెబ్బ

Update: 2024-12-09 09:15 GMT

వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ అసెంబ్లీకి ఎన్నికయ్యారని హైకోర్టు తెలిపింది. తప్పుడు సమాచారం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు చెన్నమనేనికి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీనిలో చెన్నమనేనికి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్‌కు నెల రోజుల్లో 25 లక్షల రూపాయలు చెల్లించాలని, మిగాతా 5 లక్షలు రూపాయలు లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అధికారికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

Tags:    

Similar News