Yadadri: రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం..

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2022-03-06 14:17 GMT

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాయగిరికి చెందిన అంకర్ల లక్ష్మీ, ఊరేళ్ల శ్యామ్‌, లావణ్య, కవితగా గుర్తించారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆర్టీసీ బస్సు.. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News