బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.. అన్ని పార్టీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సైతం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించినట్లు ఎస్ఈసీ తెలిపింది.