జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : 770 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు

Update: 2020-11-20 09:15 GMT

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 13వేల 500 మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 38 డివిజన్ల పరిధిలో మొత్తం 2569 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. 770 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు నోడల్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. 

Tags:    

Similar News