సమ్మర్ లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్లోని షాలిమార్, సాంత్రాగాచి లకు రైళ్లను నడుపనున్నామని అధికారులు వివరించారు. సికింద్రాబాద్-సాంత్రాగాచి (07223) రైలు ప్రతి శుక్రవారం బయలు దేరడంతో పాటు ఏప్రిల్ 19 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుదని అన్నారు.
ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్చే సాంత్రాగాచి-సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని ఆఫీసర్లు వివరించారు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుందని తెలిపారు. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు. సికింద్రాబాద్ -షాలిమార్ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం, షాలిమార్-సికింద్రాబాద్(07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయలుదేరుతాయని తెలిపారు. సికింద్రాబాద్ -కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు ఏప్రిల్ 17,24, మే 1, 8,15,22,29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుందని ఎస్సీఆర్(SCR) అధికారులు వివరించారు.
తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్(07194) రైలు ఏప్రిల్ 19, 26, మే 3,10,17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు. సో.. రైల్వే టైమింగ్స్ అనుగుణంగా మీ ప్రయాణాలు మార్చుకోండి.