Harish Rao : అక్కడి కంటే తెలంగాణలోనే కరెంట్ బాగుంది : హరీష్ రావు

Harish Rao : ఏపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు పరోక్ష విమర్శలు చేశారు;

Update: 2022-09-25 13:00 GMT

Harish Rao : ఏపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు పరోక్ష విమర్శలు చేశారు. మొన్న తిరుపతి వెళ్లినపుడు ఏపీ ప్రజలను కలిసానని.... ఎక్కడివారని వారిని అడిగితే.. తమది అనంతపురం జిల్లా గుత్తి అని చెప్పారని అన్నారు. మీ దగ్గర కరెంట్ ఎంతసేపు వస్తుందని గుత్తి ప్రజలను అడిగితే.. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కరెంట్ వస్తుందని చెప్పారని హరీష్‌రావు తెలిపారు. ఏపీలో గంట గంటకి కరెంట్ పోతుందన్న హరీష్‌రావు.. అక్కడి కంటే తెలంగాణలోనే కరెంట్ బాగుందని చెప్పారు.

Tags:    

Similar News