తెలంగాణ రాష్ట్రానికి రానున్న అయిదు రోజులపాటు భారీ వర్ష హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు శనివారం వరకు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్లు జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుముఖం పడుతు న్నాయి.
రాబోయే మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రోజున బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కర్ణాటక- గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై నున్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు ద్రోణి విస్తరించి ఉందని, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆను కొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల విస్తరించి ఉందని వాతా వరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.