హైదరాబాద్ సిటీలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లిక్కర్ అమ్మకాలపై పోలీసులు నిషేధం విధించారు. 17న ఉదయం 6 గంటల నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
స్టార్ హోటల్స్, రెస్టారెంట్ల లోని బార్లను కూడా మూసివుంటాయని స్పష్టం చేశారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.