Australia : ఆస్ట్రేలియాలో చెత్త కుండీలో శవమై కనిపించిన హైదరాబాదీ విమెన్
హైదరాబాద్కు చెందిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఆస్ట్రేలియాలోని విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో కనిపించింది. మహిళను చైతన్య మాధగానిగా గుర్తించారు. ఆమె భర్త అశోక్ రాజ్ వరికుప్పల ఆస్ట్రేలియా వదిలి దంపతుల కుమారుడితో కలిసి భారత్కు వెళ్లడంతో విచారణను ముమ్మరం చేశారు.
"విన్చెల్సియా సమీపంలోని బక్లీలో మరణించిన వ్యక్తిని గుర్తించిన తర్వాత స్క్వాడ్ డిటెక్టివ్లు దర్యాప్తు చేస్తున్నార"ని విక్టోరియా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
"మౌంట్ పొల్లాక్ రోడ్లో మధ్యాహ్నం సమయంలో మరణించిన మహిళను అధికారులు గుర్తించారు" అని ప్రకటనలో తెలిపారు. మిర్కా వే, పాయింట్ కుక్లోని రెసిడెన్షియల్ అడ్రస్లో రెండవ క్రైమ్ సీన్ స్థాపించబడిందని, బక్లీ నరహత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
"పరిశోధకులు మరణాన్ని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రమేయం ఉన్న పార్టీలు ఒకరికొకరు తెలుసని, నేరస్థుడు విదేశాలకు పారిపోయి ఉండవచ్చునని నమ్ముతున్నారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు" అని విక్టోరియా పోలీసులు వివరించారు.