ఏప్రిల్ 6న తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే జన జాతర సభకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ మేనిఫెస్టోలోని తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న 5 న్యాయ హామీల ప్రచారాన్ని విస్తృతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్ లో కీలక అంశాలు తెలిపారు రేవంత్ రెడ్డి.
సీనియర్ నేత డి.శ్రీధర్ బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి తమ సలహాలు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ కేడర్ను కోరారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించాలన్నారు.
'ఎన్నికల్లో గెలుపుపై పార్టీ ఆశాభావంతో ఉంది. తెలంగాణ ప్రభుత్వ నమూనాను జాతీయ నాయకత్వం మెచ్చుకుంది' అని రేవంత్ అన్నారు. ఎమ్మెల్సీలు, సలహాదారులు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పదవులకు నియమించబడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు.