జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ

Update: 2020-11-25 12:35 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, ఏపీ పరిణామాలపై చర్చించారు. రాజకీయంగా ఇరు పార్టీలు ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచన చేశారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారంపై కూడా ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News