Madhuyashki : బీజేపీ వదిలిన బాణం కవిత : మధుయాష్కీ

Update: 2025-06-03 07:30 GMT

ఎమ్మెల్సీ కవిత బీజేపీ వదిలిన బాణమని, బతుకమ్మ పేరుతో బతుకు నేర్చారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయా ష్కీ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ డైరెక్షన్ మేరకే కవిత పనిచేస్తున్నారని, ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుందని అన్నారు. అదే కోణంలో లేఖ అంశం తెరమీదకు తెచ్చారని చెప్పారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు మోదీతో సెల్ఫీలు దిగారని గుర్తు చేశారు. బీజేపీ వ్యూ హరచనలో భాగంగానే కవిత ఇలా మాట్లా డుతున్నారని అన్నారు. జాగృతి పేరుతో దో చుకున్న సొమ్ము ని దాచుకోవడానికే జాగృతి బలోపేతం చేస్తా అంటున్నారన్నారు. కేసీఆర్ జాతి పిత కాదు తెలంగాణ పిశాచి అని విమ ర్మించారు. కవితను చేర్చుకునేంత దరిద్రం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదని అన్నారు. ఆమె నిజామాబాద్ జిల్లాల్లో జీఎస్టీ స్కాంలకు పా ల్పడ్డారని ఆరోపించారు. రూ. 800 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే డ్రామా ఆడుతున్నారని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా నిధులు దోచేశారని ఆరోపించారు. జాగృతి ఓ అవినీతి సంస్థ అని అన్నారు. కవితకు కేసీఆర్ జాతిపిత కావచ్చనని, తెలంగాణకు ఆయన పిశాచి అని అన్నారు. కవిత చిన్న లేడీ మాఫియా డాన్ అని ఆరోపించారు. ఆమె చేయని వ్యాపారాలు లేవ న్నారు. చేయని స్కాంలు లేవని అన్నారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న కవితకు కోట్ల విలువ చేసే బిల్డింగ్స్ బంజారా హిల్స్ లో ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బంజారా హిల్స్ లో ఆమెకు రూ. 2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు న్నాయని అన్నారు. చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయల స్కాం చేశారని అన్నారు. ఆయన ఇప్పుడెందుకు మొక్కలు నాటడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోటు దొంగలని వాళ్ల స్కాంలపై విచారణ జరిపించా లని అన్నారు. అలాంటి వారిని శిక్షించే వారు నిద్ర పోకూడదని చెప్పారు. కేటీఆర్ కి అమెరికా లో పెట్టుబడులు ఉన్నాయని, అవి చూసుకొని రావడానికి వెళ్ళారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మొజాంజాహీ మార్కెట్ లో పూలు అమ్ముకునేవారన్నారు. కవిత తెలంగాణ తో పాటు ఏపీ లో బ్యూటీ పార్లర్ పెట్టుకునేవారని అన్నారు.

Tags:    

Similar News