KAVITHA: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు

మల్లన్నపై కవిత ఫిర్యాదు;

Update: 2025-07-14 03:30 GMT

తనపై అస­భ్య పద­జా­లం వా­డిన ఎమ్మె­ల్సీ తీ­న్మా­ర్ మల్ల­న్న సభ్య­త్వా­న్ని రద్దు చే­యా­ల­ని, చట్ట ప్ర­కా­రం చర్య­లు తీ­సు­కో­వా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్సీ కవిత శా­స­న­మం­డ­లి ఛై­ర్మ­న్ గు­త్తా సు­ఖేం­ద­ర్ రె­డ్డి­కి ఫి­ర్యా­దు చే­శా­రు. జూ­బ్లీ­హి­ల్స్ లోని గు­త్తా సు­ఖేం­ద­ర్ రె­డ్డి ని­వా­సా­ని­కి వె­ళ్లి ఫి­ర్యా­దు లేఖ ఇచ్చా­రు. ఎమ్మె­ల్సీ తీ­న్మా­ర్ మల్ల­న్న తన వ్య­క్తి­త్వా­న్ని దె­బ్బ­తీ­సే­లా, కిం­చ­ప­రి­చే­లా చే­సిన వ్యా­ఖ్య­ల­పై "కమి­టీ ఆన్ ఎథి­క్స్"కు రె­ఫ­ర్ చే­యా­ల­ని కో­రా­రు. ‘శాసన మం­డ­లి సభ్యు­రా­లి­నైన ఎమ్మె­ల్సీ తీ­న్మా­ర్ మల్ల­న్న అను­చిత వ్యా­ఖ్య­లు చే­శా­రు. గౌరవ చట్ట­స­భ­లో సభ్యు­డి­గా ఉన్న మల్ల­న్న గారు ప్ర­జా­ప్ర­తి­ని­ధి­నైన నాపై ఇలాం­టి వ్యా­ఖ్య­లు చే­య­డం నన్ను తీ­వ్ర ది­గ్భ్రాం­తి­కి గురి చే­సిం­ది. దేశ జనా­భా­లో సగా­ని­కి పైగా ఉన్న బీ­సీ­ల­కు జనా­భా దా­మా­షా ప్ర­కా­రం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చా­ల­ని రెం­డే­ళ్లు­గా నేను ఉద్య­మి­స్తు­న్నా­ను. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చా­ల్సిం­దే­న­ని బలం­గా గొం­తు వి­ని­పి­స్తు­న్నా­ను.” అని లే­ఖ­లో పే­ర్కొ­న్నా­రు.

బీసీ రిజర్వేషన్ల ఉద్యమంపై దుష్ప్రచారం

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో నిర్వహించిన బీసీ విజయోత్సవ సభపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని కవిత పేర్కొన్నారు. చట్టసభ సభ్యురాలిపై ఇలాంటి మాటలు చెప్పిన తీన్మార్ గారి మనస్తత్వం ద్వారా, సామాన్య మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదని నిర్ధారించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళల ప్రవేశాన్ని తగ్గించేలా ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News