మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. హెల్త్ టెస్టుల కోసం శుక్రవారం ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు.