KHAIRATABAD GANESH: ఒకరోజు ముందే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

Update: 2025-09-01 05:30 GMT

ఖై­ర­తా­బా­ద్ మహా­గ­ణ­ప­తి ని­మ­జ్జ­నా­న్ని సె­ప్టెం­బ­ర్ 6వ తే­దీన చే­య­ను­న్న­ట్టు కమి­టీ సభ్యు­లు వె­ల్ల­డిం­చా­రు. సె­ప్టెం­బ­ర్ 7వ తే­దీన ని­మ­జ్జ­నం జర­గా­ల్సి ఉం­డ­గా అదే రోజు చం­ద్ర­గ్ర­హ­ణం ఉం­డ­టం­తో ముం­దు రోజు ని­మ­ర్జ­నం చే­స్తు­న్న­ట్టు తె­లి­పా­రు. శని­వా­ర­మే మహా­గ­ణ­ప­తి శో­భా­యా­త్ర­ను ని­ర్వ­హిం­చి ని­మ­జ్జ­నం పూ­ర్తి చే­య­ను­న్న­ట్లు ని­ర్వా­హ­కు­లు స్ప­ష్టం చే­శా­రు. నేడు ఆది­వా­రం కా­వ­టం­తో వి­శ్వ­శాం­తి మహా­శ­క్తి గణ­ప­తి­ని దర్శిం­చు­కు­నేం­దు­కు భా­రీ­గా తర­లి­వ­స్తు­న్నా­రు. ఆది­వా­రం నాడు ఖై­ర­తా­బా­ద్ పరి­సర ప్రాం­తా­లు జన­సం­ద్రం­గా మా­రా­యి. భక్తుల సౌ­క­ర్యా­ర్థం మూడు క్యూ­లై­న్ల­ను ఏర్పా­టు చే­శా­రు

తాడిపత్రిలో గణేష్ శోభాయాత్రలో ఘర్షణ

అనం­త­పు­రం జి­ల్లా తా­డి­ప­త్రి పట్ట­ణం­లో వి­నా­యక ని­మ­జ్జ­నం సం­ద­ర్భం­గా ఉద్రి­క్తత చో­టు­చే­సు­కుం­ది. శో­భా­యా­త్ర­లో జేసీ ప్ర­భా­క­ర్‌­రె­డ్డి అను­చ­రు­లు, కా­క­ర్ల రం­గ­నా­థ్ అను­చ­రు­లు పర­స్ప­రం ఎదు­రె­దు­ర­య్యా­రు. మొదట ని­నా­దా­ల­తో ప్రా­రం­భ­మైన వా­గ్వా­దం, తరు­వాత రా­ళ్ల దా­డి­గా మారి రెం­డు వర్గాల మధ్య ఘర్ష­ణ­కు దారి తీ­సిం­ది. అం­దిన సమా­చా­రం ప్ర­కా­రం, ఆసు­ప­త్రి­పా­లెం వద్ద కా­క­ర్ల రం­గ­నా­థ్ వర్గా­ని­కి చెం­దిన వి­నా­యక వి­గ్ర­హం ని­దా­నం­గా వె­ళ్తుం­డ­టం­తో జేసీ ప్ర­భా­క­ర్‌­రె­డ్డి వే­గం­గా తీ­సు­కె­ళ్లా­ల­ని సూ­చిం­చా­రు. దీ­ని­పై ఆగ్ర­హిం­చిన రం­గ­నా­థ్, ప్ర­భా­క­ర్‌­రె­డ్డి­ని దూ­షిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ ఘట­న­తో ఇరు­వ­ర్గాల మధ్య ఉద్రి­క్త వా­తా­వ­ర­ణం నె­ల­కొ­ని రా­ళ్ల దా­డు­లు జరి­గా­యి. ఈ దా­డి­లో రం­గ­నా­థ్ వర్గా­ని­కి చెం­దిన ఐషర్ వా­హ­నం, లారీ అద్దా­లు ధ్వం­స­మ­య్యా­యి. పరి­స్థి­తి అదు­పు­లో­కి వచ్చిన తర్వాత పో­లీ­సు­లు తి­రి­గి శో­భా­యా­త్ర కొ­న­సా­గిం­చా­రు. ఎన్ని­కల ముం­దు­కు కా­క­ర్ల రం­గ­నా­థ్‌ వై­కా­పా నుం­చి తె­దే­పా­లో చే­రా­రు. ఎన్ని­కల అనం­త­రం ప్ర­భా­క­ర్‌­రె­డ్డి, రం­గ­నా­థ్‌ వర్గాల మధ్య వి­వా­దం తలె­త్తిం­ది. అనం­త­రం శో­భా­యా­త్ర కొ­న­సా­గిం­ది.

Tags:    

Similar News