తనను గుజరాత్కు గులాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… తాను భారతీయలకు మాత్రమే గులాం అన్నారు. రేవంత్ రెడ్డి ఇటలీకి గులామని, నకిలీ గాంధీ కుటుంబానికి గులాం అని విమర్శించారు. తెలంగాణను రక్షించిన సర్దార్ పటేల్ గుజరాత్ బిడ్డకు తాను గులామ్నే అంటూ సెటైర్ వేశారు. మూసీ నిద్ర ప్రోగ్రామ్ తో హల్చల్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. మూసీ పరిరక్షణ చేయాలంటూనే పేదలకు న్యాయం చేయాలని యాత్ర చేస్తున్నారు కిషన్ రెడ్డి.