చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. ఆయన సతీమణి మృతితో విషాదంలో ఉన్న సత్యం కుటుంబాన్ని పరామర్శించి కేటీఆర్ ఓదార్చారు. ఆల్వాల్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని రూపాదేవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి వారం క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.