KTR: జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..
KTR: మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
KTR: మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. నిన్న జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. NPA ప్రభుత్వంలో ఇండియన్ ఎకానమీ సర్వనాశనం అయిందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 45 ఏళ్లలోనే గరిష్టస్థాయికి చేరిందని, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టాన్ని తాకిందని, ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా ఇండియాలోనే ఎక్కువ రేటు పలుకుతోందని మండిపడ్డారు. దేశాన్ని ఇంతలా నాశనం చేసిన వాళ్లు.. తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.