హైదరాబాద్ వర్షాలపై మంత్రి కేటీఆర్ రివ్యూ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రికి వివరించారు అధికారులు. మొత్తం 44 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. మొత్తం 64 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 45 వేల మందికి ఆహార పంపిణి చేసినట్లు తెలిపారు. మరోవైపు పురాతన ఇళ్లు కూలిపోతుండటంతో... ఈ విషయంలో సీరియస్గా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ఇళ్లలో ఉంటున్న వారిని పోలీస్ ఫోర్స్తో ఖాళీ చేయించాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.