వరద బాధితుల్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. శంషాబాద్ గగన్పహాడ్లో పర్యటించిన మంత్రులు కేటీఆర్, సబితా... అప్పచెరువు,వరద ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. గల్లంతయిన మృతదేహాల వెలికితీతపై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు.