LOCAL WAR: నేటి నుంచి సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు

తొలి విడత స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ... మొదటి దశలో 4,200 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్... 37,440 వార్డులకు నామినేషన్ల స్వీకరణ

Update: 2025-11-27 03:30 GMT

గ్రా­మీణ ప్రాం­తా­ల్లో ఎన్ని­కల వేడి మొ­ద­లైం­ది. రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం స్థా­నిక సం­స్థల నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­య­డం­తో గ్రా­మా­ల్లో అభ్య­ర్థుల హడా­వు­డి ఎక్కు­వైం­ది. సర్పం­చ్ కా­వా­ల­ని రెం­డే­ళ్లు­గా ఎదు­రు­చూ­స్తు­న్న ఆశా­వ­హు­లు తాజా నో­టి­ఫి­కే­ష­న్‌­లో రం­గం­లో­కి ది­గా­రు. కు­ల­సం­ఘా­లు, యు­వ­జన సం­ఘా­లు, మం­డ­లం­లో ఉన్న ము­ఖ్య నే­త­ల­ను ప్ర­స­న్నం చే­సు­కు­నేం­దు­కు­తా­యి­లా­లు అం­ది­స్తు­న్నా­రు. ఇక ఊర్ల­లో వా­ర్డు మెం­బ­ర్ నుం­చి సర్పం­చ్ అభ్య­ర్థి వరకు ఇప్ప­టి నుం­చే ఇళ్ల­కు వె­ళ్లి ఓట­ర్ల­తో మాట ము­చ్చట కలు­పు­తు­న్నా­రు. పిం­ఛ­న్లు వస్తు­న్నా­యా..? ఇం­ది­ర­మ్మ ఇల్లు వచ్చిం­దా..? తా­గు­నీ­రు వస్తుం­దా..? ఇంకా ఏఏ సమ­స్య­లు ఉన్నా­యి..? అంటూ వా­కా­బు చే­స్తు­న్నా­రు.

 మొదటి విడత నేటి నుంచే..

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మొదటి విడత సర్పంచ్  ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ఉంటుంది.

తక్కువ డిపాజిట్‌తోనే...

అతి తక్కువ ఫీ­జు­తో­నే ఈ ఎన్ని­క­ల్లో పోటీ చేసే అవ­కా­శా­న్ని రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న్ కల్పిం­చిం­ది. జడ్పీ­టీ­సీ జన­ర­ల్ అభ్య­ర్థి రూ.5 వేలు, రి­జ­ర్వు­డ్ అభ్య­ర్థి రూ.2,500 డి­పా­జి­ట్ చే­యా­ల్సి ఉం­టుం­ది. ఎం­పీ­టీ­సీ­కి జన­ర­ల్ అభ్య­ర్థి రూ.2,500, రి­జ­ర్వు­డ్ అభ్య­ర్థి రూ.1,250 డి­పా­జి­ట్ చే­యా­లి. సర్పం­చ్ జన­ర­ల్ అభ్య­ర్థి రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య­ర్థి వె­య్యి రూ­పా­య­లు డి­పా­జి­ట్ చే­స్తే సరి­పో­తుం­ది. ఇక వా­ర్డు మెం­బ­ర్‌­గా పోటీ చేసే జన­ర­ల్ కే­ట­గి­రి అభ్య­ర్థి కే­వ­లం రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య­ర్థి రూ.250 చె­ల్లి­స్తే పో­టీ­కి అర్హు­లు అవు­తా­రు. నా­మి­నే­ష­న్లు వే­శాక అసం­తృ­ప్తు­ల­ను బు­జ్జ­గిం­చి, పోటీ నుం­చి తప్పిం­చ­డ­మూ జరు­గు­తు­న్న­ది. 2019 ఎన్ని­క­ల్లో 16 శాతం గ్రా­మా­ల్లో సర్పం­చ్​­స్థా­నా­లు యు­నా­ని­మ­స్​అ­య్యా­య­ని అప్ప­ట్లో ఈసీ ప్ర­క­టిం­చిం­దం­టే ఏక­గ్రీ­వా­ల­కు ఇక్కడ ఎంత క్రే­జ్​ఉం­దో అర్థం చే­సు­కో­వ­చ్చు. కానీ ఈసా­రి ఈ ఏక­గ్రీ­వా­లు అను­మా­న­మే అం­టు­న్నా­రు. రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం రెడీ చే­స్తు­న్న ప్ర­తి­పా­ద­‌­‌­న­‌­‌­లే ఇం­దు­కు కా­ర­ణ­మ­ని ని­పు­ణు­లు చె­బు­తు­న్నా­రు. పం­చా­య­‌­‌­తీ ఎన్ని­క­ల్లో ఈ సారి ఏక­గ్రీ­వా­ల­కు తా­వు­లే­కుం­డా ఎన్ని­క­‌­‌­లు ని­ర్వ­హిం­చా­ల­ని రా­ష్ట్ర ఎన్ని­క­‌­‌ల సంఘం ప్లా­న్ చే­స్తు­న్న­ది. ఈ మే­ర­కు స్టే­ట్​ఎ­ల­‌­‌­క్ష­న్ క‌­‌­మి­ష­‌­‌­న్ కొ­త్త ప్ర­తి­పా­ద­‌­‌­న­‌­‌­ల­ను రెడీ చే­స్తు­న్న­ది. ‘రైట్ నా­ట్​ టు ఓట్’ ప్ర­కా­రం అభ్య­ర్థి నచ్చ­కుం­టే నో­టా­ను ఎం­చు­కు­నే హ‌­‌­క్కు ఉంది.

Tags:    

Similar News