Madhu Goud Yaskhi : రాహుల్ గాంధీ సభ చూసి టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుడుతోంది : మధుయాష్కీ

Madhu Goud Yaskhi : రాహుల్ గాంధీ సభ చూసి.. టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుడుతోందని టీ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ అన్నారు.

Update: 2022-05-10 13:45 GMT

Madhu Goud Yaskhi : రాహుల్ గాంధీ సభ చూసి.. టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుడుతోందని టీ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ అన్నారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్‌ అన్నారని ఆయన పేర్కొన్నారు. డిక్లరేషన్‌పై జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రచారం చేయాలన్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దక్కుతుందన్న మధుయాష్కి.. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారని అన్నారు. 

Tags:    

Similar News