Madhu Yashki: బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు: మధు యాష్కీ

Madhu Yashki: బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు అంటూ మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ గౌడ్.

Update: 2022-10-27 09:17 GMT

Madhu Yashki: బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు అంటూ మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ గౌడ్. మునుగోడు ఎన్నికల ముందు డ్రామా అడుతున్నాయని ఫైర్‌ అయ్యారు. దోచుకున్న డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామం మీద నమ్మకం లేని వాళ్ళు టీఆర్‌ఎస్‌, బీజేపీ అని మధుయాష్కీ అన్నారు. ఫామ్‌హౌస్ బిగ్‌డీల్‌ వెనక మంత్రాంగం అంతా ఎవరు నడిపారన్నది తేలాలంటే సీబీఐ విచారణ వేయాలి అన్నారు..పట్టుబడిన ముగ్గురు నిందితుల వెనక ఎవరున్నారన్నది తేల్చాలని డియాండ్‌ చేశారు..

తెలంగాణలో కాంగ్రెస్‌ రోజు రోజుకు బలపడుతుండటంతో దిక్కుతొచని బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని అన్నారు..తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని అన్నారు మధుయాష్కీ.

Tags:    

Similar News