మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతరత్నకు అర్హులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. అనవసర ఖర్చులకు పోకుండా పొదుపుగా దేశాన్ని పాలించారని కేటీఆర్ అన్నారు. తమ నాయకులు కేసీఆర్ మంత్రిగా కూడా ఆయన క్యాబినెట్లో చేశారన్నారు. మన్మోహన్ తరహాలోనే పీవికి సమానమైన గౌరవం దక్కలేదని గుర్తు చేశారు. పీవీకి మాత్రమే ఢిల్లీలో ప్రత్యేకంగా మెమోరియల్ లేదని.. మన తెలుగు వ్యక్తికి అవమానం జరిగేలా చేసుకోవడం సరికాదన్నారు.