గ్రేటర్లో సమన్వయంపై చర్చించేందుకు బీజేపీ- జనసేన ముఖ్యనేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, OBC మోర్చా నాయకులు లక్ష్మణ్ చర్చలు జరిపారు. జనసేనతో పొత్తు లేదని నిన్న BJP అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించినా,.. హైకమాండ్ ఆదేశాలతో మళ్లీ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.