నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధిత మహిళకు అందుతున్న చికిత్సపై మంత్రి సీతక్కకు నిమ్స్ డైరెక్టర్ Dr.బీరప్ప, మెడికల్ సూపరిండెంట్ Dr. సత్యనారాయణ వివరించారు.
కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి సీతక్క.. నిందితులు ఎంతటివారైనా.. సరే శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.