Miss World Events : హైదరాబాద్ లోనే మిస్ వరల్డ్ గ్రాండ్ ఈవెంట్స్

Update: 2025-02-20 09:45 GMT

మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదికకానుంది. ఈ ఏడాది జరిగే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 2025 ఏడాది మే 7వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ ప్రారంభం,ముగింపు వేడుకలు ఇక్కడే ఉంటాయని నిర్వాహణ సంస్థ తెలిపింది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొనున్నారు. కాగా ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారత్లో జరగనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్ డమ్ లో ఎరిక్ మోర్లీ స్థాపించారు. దశాబ్దాలుగా ఈ ఐకానిక్ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నాయి.

భారతదేశంలో చివరిగా 1996లో మిస్ వరల్డ్ టీకి ఆతిథ్యం ఇచ్చింది. తిరిగి మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో అది కూడా తెలంగాణ లోని హైదరాబాద్లో నిర్వహించనుంది. అయి తే మొదట ఢిల్లీలో ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించగా.. తాజాగా ఈ మిస్ వరల్డ్ పోటీల హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News