Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నిలిచిపోయిన సేవలు..
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ విభాగంతో పాటు పలు వార్డుల్లో విలువైన పరికరాలు కాలిపోయాయి. దీంతో డయాలసిస్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతిరోజు 30 మంది కిడ్నీ రోగులకు వైద్యం అందిస్తున్నారు. దీని కోసం 4 మిషన్లు పనిచేస్తున్నాయి. అగ్నిప్రమాదంతో ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. దీంతో బాధితులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. త్వరలోనే వైద్య సేవలు పునరుద్దరిస్తామని అధికారులు చెప్పారు.