Kishan Reddy : కవిత వివాదంపై ఎవరూ మాట్లాడొద్దు : కిషన్ రెడ్డి

Update: 2025-05-31 06:30 GMT

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రేపిన వివాదం, ఆరోపణలు, విమర్శలపై స్పందించొద్దని, అది పూర్తిగా ఆ పార్టీ, కేసీఆర్ కుటుంబ వ్యవహారమని, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ వివాదం అంతా డాటర్, సిస్టర్, బ్రదర్ డ్రామా అని కొట్టిపారేశారు. కవిత ఎందుకు జైలుకువెళ్లారో అందరికీ తెలుసునని, అలాంటివారి మాటలకు విలువే ముంటుందని అన్నారు. ఈ వ్యవహారం డాడీ, డాటర్, సిస్టర్, బ్రదర్ సమస్య అని, అంతా నాటకమని. ఆ డ్రామాలో తాము (బీజేపీ) భాగ స్వామ్యం కాదలచుకోలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై ఆయన స్పందించారు.

ఎమ్మెల్సీ కవిత వ్యవహారం... బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య కావొచ్చు, లేదంటే కుటుంబ వివాదం కావొచ్చు.. అధి కారం కోసమో, ఆస్తి కోసమో జరుగుతున్న ఘర్షణ అని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని అభిప్రా యపడ్డారు. దాన్ని రాజకీయ, తెలంగాణ అంశంగా చూడొద్దని ఆయన తెలిపారు. బీజేపీలో విలీనం కోసం ఎవరితో చర్చలు జరి పారో ఆ వివరాలను కేసీఆర్ బయట పెట్టాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, ఆకంపెనీలో వారం తా డైరెక్టర్లు అని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీ లోని వారి మధ్యలో ఆస్తుల కొట్లాట, లేక అధికార ఘర్షణ జరుగుతుండొచ్చని, ఆ కొట్లాటపై బీజేపీ ఎందుకు మాట్లాడాలి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలపై తప్పకుండా మాట్లాడతామని అన్నారు.

Tags:    

Similar News