ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శనివారం దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్పేట సమీపంలోని భారత్ బయోటెక్ను మోదీ సందర్శించనున్నారు. కొవిడ్ నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న 'కొవాగ్జిన్' టీకా పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రధాని పుణె పర్యటనకు వెళ్లనున్నారు. అయితే... జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. ప్రధాని హైదరాబాద్కు రానుండటం ఆసక్తికరంగా మారింది. కానీ ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ రానుండటం ఆసక్తికరంగా మారింది.