TG : ఎమ్మెల్యే నుండి పీఎం దాకా.. నేడు పీవీ నరసింహారావు జయంతి

Update: 2024-06-28 08:46 GMT

తెలంగాణలో జన్మించి దేశ దశాదిశా మార్చిన మహా నాయకుడు పీవీ నరసింహారావు ( PV Narasimha Rao ). 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారు. పీవీ చొరవతోనే ఎన్నో విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీవీని భారతరత్న పురస్కారం వరించింది.

తెలంగాణలో రైతు కూలీల చేతికి ఎంతోకొంత భూమి దక్కిందంటే ఆయన వేసిన భూసంస్కరణల పాదే కారణం. ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రిగా కూడా పీవీ అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేశారు. జైళ్ల శాఖ మంత్రిగా ఓపెన్‌ జైల్‌ అనే వినూత్న పద్దతికి పీవీ శ్రీకారం చుట్టి పక్కాగా అమలు చేశారు.

పీవీకి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పీవీ ఎంతోగానో కృషి చేశారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, తెలుగు మీడియం ద్వారా ఉన్నత విద్య వంటి కార్యక్రమాలు విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు అమలు చేసినవే.

Tags:    

Similar News