హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతాన్ని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకటించింది.
యూసుఫ్గూడలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ 4.8, కుత్భుల్లాపూర్లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.3, బాలానగర్, షేక్పేట్లో 4.2, రాయదుర్గం, నేరెడ్మెట్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది.