TG : తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల

Update: 2024-07-03 05:43 GMT

రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.

విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్‌ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌లు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యమిశ్రా బుధవారం మాట్లాడి.. అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్ర బుధవారం మాట్లాడుతారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాలలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు.

Tags:    

Similar News