REVANTH: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు: సీఎం రేవంత్

కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు

Update: 2025-09-20 05:00 GMT

తె­లం­గా­ణ­లో రవా­ణా, అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కీలక ప్ర­క­ట­న­లు చే­శా­రు. త్వ­ర­లో హై­ద­రా­బా­ద్‌­లో మూడు వేల ఎల­క్ట్రి­క్ బస్సు­ల­ను ప్ర­వే­శ­పె­డ­తా­మ­ని తె­లి­పా­రు. హై­ద­రా­బా­ద్‌ నగరం శర­వే­గం­గా అభి­వృ­ద్ధి చెం­దు­తోం­ద­ని రే­వం­త్‌ తె­లి­పా­రు. ఢి­ల్లీ­లో ని­ర్వ­హిం­చిన ఓ సద­స్సు­లో ఆయన పా­ల్గొ­ని మా­ట్లా­డా­రు. 2047 నా­టి­కి తె­లం­గాణ ప్రా­ధా­న్యత రం­గా­ల­ను వి­వ­రిం­చా­రు. రా­ష్ట్ర సు­స్థి­రా­భి­వృ­ద్ధి­కి ప్రై­వే­టు రంగం మద్ద­తు గు­రిం­చి తె­లి­పా­రు. అభి­వృ­ద్ధి కోసం ‘తె­లం­గాణ రై­జిం­గ్‌ 2047’ రూ­పొం­దిం­చు­కు­న్న­ట్లు చె­ప్పా­రు. తె­లం­గాణ రా­ష్ట్రం­లో ఎల­క్ట్రి­క్ వా­హ­నాల అమ్మ­కా­ల్లో తె­లం­గాణ మొ­ద­టి స్థా­నం­లో ఉం­ద­ని చె­ప్పా­రు. హై­ద­రా­బా­ద్, బెం­గ­ళూ­రు మధ్య బు­ల్లె­ట్ రైలు ఏర్పా­టు చే­స్తా­మ­ని, ఔటర్ రిం­గ్ రో­డ్డు­కు అను­బం­ధం­గా రీ­జి­న­ల్ రిం­గ్ రో­డ్డు­ను అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని తె­లి­పా­రు. ఫా­ర్మా, ఇతర రం­గా­ల­కు రో­డ్‌­మ్యా­ప్‌­లు సి­ద్ధం చే­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు.తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి శ్రీ రే­వం­త్ రె­డ్డి ఢి­ల్లీ­లో జరి­గిన ఒక సద­స్సు­లో పా­ల్గొ­ని, హై­ద­రా­బా­ద్ నగరం భవి­ష్య­త్తు ప్ర­ణా­ళి­క­ల­ను వి­వ­రిం­చా­రు. ప్ర­ణా­ళి­కా­బ­ద్ధ­మైన అభి­వృ­ద్ధి­కి ఫ్యూ­చ­ర్‌­సి­టీ­ని ని­ర్మి­స్తు­న్నాం. వి­మా­నా­శ్ర­యం నుం­చి ఫ్యూ­చ­ర్‌ సి­టీ­కి కనె­క్టి­వి­టీ ఏర్పా­టు చే­స్తాం.

కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు

హై­ద­రా­బా­ద్‌-బెం­గ­ళూ­రు మధ్య బు­ల్లె­ట్‌ రైలు ఇవ్వా­ల­ని కేం­ద్రా­న్ని కో­రాం. తె­లం­గాణ గ్రా­మీణ ప్రాం­తా­ల్లో వ్య­వ­సాయ ఉత్ప­త్తు­ల­ను ప్రో­త్స­హి­స్తాం. డ్ర­గ్స్‌ కట్ట­డి­లో మా రా­ష్ట్ర పో­లీ­సు­లు దే­శం­లో­నే నెం­బ­ర్‌ వన్‌­గా ఉన్నా­రు. 2034 కల్లా ట్రి­లి­య­న్‌ డా­ల­ర్ల, 2047 కల్లా మూడు ట్రి­లి­య­న్‌ డా­ల­ర్ల ఎకా­న­మీ­గా మా­రా­ల­నే­ది మా లక్ష్యం. దేశ జీ­డీ­పీ­లో 10 శాతం తె­లం­గాణ నుం­చే రా­వా­ల­నే­ది మా ధ్యే­యం’’ అని రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. . ' తె­లం­గాణ రై­జిం­గ్ 2047 ' అనే లక్ష్యం­తో, రా­బో­యే 20 ఏళ్ళ­లో తె­లం­గా­ణ­ను ఒక అభి­వృ­ద్ధి చెం­దిన.. సు­స్థిర రా­ష్ట్రం­గా మా­ర్చ­డా­ని­కి ప్ర­భు­త్వం కృషి చే­స్తోం­ద­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­కు ఒక­ప్పు­డు జీ­వ­న­ది­గా ఉన్న మూసీ నది­ని తి­రి­గి పు­న­రు­ద్ధ­రిం­చ­డా­ని­కి ప్ర­భు­త్వం ని­బ­ద్ధ­త­తో ఉంది. గు­జ­రా­త్‌­లో­ని సబ­ర్మ­తి తీ­రం­లా మూ­సీ­ని అభి­వృ­ద్ధి చే­యా­ల­నే లక్ష్యం­తో మూసీ రి­వ­ర్‌­ఫ్రం­ట్ కా­ర్పొ­రే­ష­న్ ఏర్పా­టు చే­శా­రు. పర్యా­వ­రణ పరి­ర­క్ష­ణ­లో భా­గం­గా, కా­లు­ష్య కారక పరి­శ్ర­మ­ల­ను నగరం వె­లు­ప­లి­కి తర­లిం­చి, పర్యా­వ­ర­ణ­హి­త­మైన ఎల­క్ట్రి­క్ వా­హ­నా­ల­ను ప్రో­త్స­హి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News