TS : సోనియా గాంధీకి రేవంత్ ప్రభుత్వం సత్కారం

Update: 2024-05-21 09:10 GMT

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయిుంచింది. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించాలని.. సత్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఈసీ అనుమతితో సమావేశం నిర్వహించిన కేబినెట్ తీర్మానం చేసింది. భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) లేఖ కూడా రాసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతిని కోరింది తెలంగాణ కేబినెట్.

సన్న ధాన్యం వరి క్వింటాల్‌కు బోనస్‌గా రూ.500, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ బోనస్‌ను అందించే సన్న ధాన్యం రకాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) శాస్త్రవేత్తలు త్వరలో ప్రకటిస్తారు.

Tags:    

Similar News