REVANTH: తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్ ఆరంభం
జీవితాలను గూగుల్ డిజిటల్ మయంగా మార్చిందన్న సీఎం;
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉందని రేవంత్ తెలిపారు. ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే అని తెలిపారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని.. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్గా మారాయన్నారు. గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ‘మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాము’ అని చెప్పుకొచ్చారు.
కేసీఆర్-జగన్ ఒప్పందం వల్లే
మాజీ సీఎం కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు." బేసిన్లు లేవు భేషజాలు లేవు" అన్న కేసీఆర్ మాటలను రేవంత్ గుర్తు చేశారు. తాజాగా ప్రాజెక్టుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సీఎం మాట్లాడారు.