REVANTH REDDY: అదీ.. దెయ్యాల రాష్ట్ర సమితి

బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్.. డీఆర్ఎస్‌ అంటే దెయ్యాల రాష్ట్ర సమితి;

Update: 2025-06-07 03:30 GMT

బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రిలో పర్యటించిన సీఎం రేవంత్‌ పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేశారు. తిరుమలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆశీస్సులతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. గతంలో యాదగిరిగుట్ట పేరు మార్చి యాదాద్రి చేశారని... తాము అధికారంలోకి వస్తే మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పామని.. చెప్పినట్లే యాదాద్రి పేరును యాదగిరి గుట్ట మార్చామని వెల్లడించారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయంలో పనులు చేపట్టామని అన్నారు. గత పదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజల కష్టాలు చూసేందుకు వచ్చానని.. వారి కష్టాలు చూసి చలించిపోయామని వెల్లడించారు. అందుకే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని మాటిచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించామని అన్నారు.

డీఆర్‌ఎస్‌గా మారిన బీఆర్‌ఎస్‌

తెలంగాణను అభివృద్ధి చేసుకోవద్దా అని రేవంత్ ప్రశ్నించారు. తాము ఇంకా ఎన్నాళ్లు ఈ మూసీ మురికిలో ఉండాలని అడిగారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా ప్రజల బాధలు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాదు.. ఇప్పుడు అది డీఆర్ఎస్.. డీఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అని ముఖ్యమంత్రి రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి దయ్యాలను పొలిమేరల వరకు తరిమి కొట్టాలన్న ముఖ్యమంత్రి... దానికి నల్లగొండ జిల్లా ప్రజల సహకారం కావాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అందరు కాంగ్రెస్ నేతలను 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు.

నల్లగొండ జిల్లాను నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌

ఎంతో మంది మహానీయులు పుట్టిన జిల్లా నల్లగొండ. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యంగా పోరాడారు. అలాంటి నల్లగొండ జిల్లాను గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇకపై ప్రతిపక్షాలు పేదలు, రైతులను రెచ్చగొడితే నల్లగొండ జిల్లా ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయిందని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఎవరూ అడ్డుపడ్డా గందమళ్ల ప్రాజెక్ట్ పూర్తి తీసి తీరుతామని తేల్చి చెప్పారు. యాదగిరి గుట్ట నరసింహుడి ఆశీస్సులతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ప్రజల సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే యాదాద్రిని యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పినాం.. చెప్పినట్లుగానే పవర్‎లోకి వచ్చాక భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా  యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చామన్నారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు చేశామని.. త్వరలోనే వైటీడీ బోర్డును నియమిస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ యాదగిరిగుట్టపై ఆటోలను కూడా నిషేధించిందని.. గుట్టపై భక్తులు నిద్ర చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

ప్రతీ వెధవ నీతులు చెప్పడమే..?

తెలంగాణను బొందలగడ్డ నుంచి ప్రతీ వెధవ ఇప్పుడు తమకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. యాదగిరిగుట్టలో అపచారం వల్లే గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకున్నది.. చేసిన పాపాల వల్లే కిందపడి మక్కెలు విరిగాయని కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాసాలమర్రిని ఆగమాగం చేశారు.. ఆ గ్రామాన్ని సరిచేసే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు.

Tags:    

Similar News