తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీని బలంగా టార్గెట్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మక్తల్ లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అవకాశం చేజారిపోతే.. ఈ జిల్లా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు అని అన్నారు. డీకే అరుణ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని కీలక వ్యాఖ్యలు. చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.
బీజేపీని గెలిపిస్తే మత విద్వేశాలను ప్రోత్సాహించినట్లే అని అన్నారు. తెలంగాణకు రావాల్సిన కంపెనీలు, ఉత్తరప్రదేశ్ కు,గుజరాత్ కు తరలించుకుపోవడం ఏనాడైనా చూశామా? అని అడిగారు. నిత్యం మతకలహాలు ఉండటం వల్లే యూపీకి కంపెనీలు రావడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి.