REVANTH: మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన... ఫేజ్ 2,ఫేజ్ 3 పనులకు రేవంత్ భూమిపూజ... హైదరాబాద్ ప్రజల దాహార్తీ తీర్చేందుకే పథకం

Update: 2025-09-09 04:00 GMT

హై­ద­రా­బా­ద్‌ నగర ప్ర­జల దా­హా­ర్తి­ని తీ­ర్చ­డా­ని­కే గో­దా­వ­రి తా­గు­నీ­టి పథకం తీ­సు­కొ­చ్చి­న­ట్లు సీఎం రే­వం­త్‌­రె­డ్డి తె­లి­పా­రు. వరద ని­యం­త్రణ కో­స­మే ఉస్మా­న్‌­సా­గ­ర్‌, హి­మా­య­త్‌­సా­గ­ర్‌ జంట జలా­శ­యా­ల­ను ని­ర్మిం­చా­ర­ని అన్నా­రు. తా­గు­నీ­టి సమ­స్య­లు పరి­ష్క­రిం­చ­డా­ని­కే పీ­జే­ఆ­ర్‌ పో­రా­టా­లు చే­శా­ర­ని గు­ర్తు చే­శా­రు. మూసీ పు­న­రు­జ్జీ­వం­లో భా­గం­గా.. ఉస్మా­న్‌­సా­గ­ర్‌ వద్ద చే­ప­ట్టిన గో­దా­వ­రి తా­గు­నీ­టి సర­ఫ­రా పథకం ఫే­జ్‌ 2, 3 ప్రా­జె­క్టు పను­ల­కు సీఎం శం­కు­స్థా­పన చే­శా­రు. గో­దా­వ­రి జలా­ల­ను హై­ద­రా­బా­ద్ కు మల్ల­న్న­సా­గ­ర్ నుం­చి తీ­సు­కు­రా­వ­డం లే­ద­ని.. శ్రీ పాద ఎల్లం­ప­ల్లి ప్రా­జె­క్టు నుం­చి తీ­సు­కొ­స్తా­మ­ని రే­వం­త్ వె­ల్ల­డిం­చా­రు. తాటి చె­ట్టు­లా పె­రి­గి­నా హరీ­శ్ రా­వు­కు బు­ద్ధి పె­ర­గ­లే­ద­ని తీ­వ్రం­గా మం­డి­ప­డ్డా­రు. ఎల్లం­ప­ల్లి కట్టిం­ది కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ­మే­న­ని గు­ర్తు చే­శా­రు. రూ.7,360 కో­ట్ల­తో హ్యా­మ్‌ వి­ధా­నం­లో ఈ పను­లు చే­ప­ట్ట­ను­న్నా­మ­న్న రే­వం­త్... రెం­డే­ళ్ల­లో గో­దా­వ­రి ఫే­జ్‌ 2, 3 పను­లు పూ­ర్తి చే­యా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ద­న్నా­రు. నల్గొండ జి­ల్లా­లో పా­ద­యా­త్ర చే­సి­న­ప్పు­డు మూసీ నది­ని ప్ర­క్షా­ళన చే­యా­ల­ని ప్ర­జ­లు చె­ప్పా­ర­ని అన్నా­రు. సమ­స్య­లు సృ­ష్టిం­చి­నా సమ­న్వ­యం­తో ముం­దు­కె­ళ్తు­న్నా­మ­న్నా­రు. తా­గు­నీ­రు అం­దిం­చేం­దు­కు ఈ పథకం ఎంతో ఉప­యో­గ­ప­డు­తుం­ద­న్నా­రు. ఎవ­రె­న్ని అడ్డం­కు­లు సృ­ష్టిం­చి­నా మూసీ నది­ని తప్ప­కుం­డా ప్ర­క్షా­ళన చే­స్తాం అని సీఎం రే­వం­త్‌ రె­డ్డి తె­లి­పా­రు. గత ఏడా­దే గో­దా­వ­రి ఫేజ్ 2, 3 పను­లు ప్రా­రం­భి­ద్దాం అను­కు­న్నా కొం­ద­రు అడ్డు­కు­న్నా­ర­ని.. గో­దా­వ­రి ఫేజ్ 2, 3 ద్వా­రా 20 టీ­ఎం­సీల నీ­టి­ని తీ­సు­కు­వ­స్తాం అని చె­ప్పా­రు. 2014 నుం­చి బీ­ఆ­ర్ఎ­స్ ఒక్క చు­క్క నగ­రా­ని­కి తీ­సు­కు­రా­వా­ల­నే ఆలో­చన చే­య­లే­ద­ని, తాము మరలా అధి­కా­రం­లో­కి వచ్చాక గో­దా­వ­రి నీ­టి­ని తీ­సు­కు­రా­వ­డా­ని­కి ప్ర­ణా­ళి­క­లు చేసి ముం­దు­కె­ళ్తు­న్నా­మ­న్నా­రు.


ప్రజల దాహార్తిని తీర్చుతాం

‘గో­దా­వ­రి నదీ జలా­ల­ను మూసీ నది, ఈసా నది­లో సమ్మే­ళ­నం చేసి నగర ప్ర­జల దా­హా­ర్తి­ని తీ­ర్చు­తాం. హై­ద్రా­బా­ద్ నగ­రం­కు ప్ర­పంచ దే­శా­ల్లో గొ­ప్ప పే­రుం­ది. 1908లో నగర ప్ర­మా­దా­న్ని ని­వా­రిం­చ­డా­ని­కి ని­జాం సర్కా­ర్ ఉస్మా­న్ సా­గ­ర్, హి­మా­య­త్ సా­గ­ర్ ప్రా­జె­క్టు­ల­ను ని­ర్మిం­చా­రు. ప్ర­పం­చం­లో­నే గొ­ప్ప ఇం­జి­నీ­ర్ల­తో ని­జాం సర్కా­ర్ ఈ ప్రా­జె­క్టు­లు కట్టిం­ది. దూ­ర­దృ­ష్టి­తో ఆలో­చిం­చి ఈ ప్రా­జె­క్టు­లు కట్ట­డం­తో నగర దాహం తీ­రు­తోం­ది. నగ­రం­లో జనా­భా పె­రు­గు­తోం­ది, ఉద్యో­గాల కోసం హై­ద­రా­బా­ద్ వస్తు­న్నా­రు. నగర జనా­భా కో­టి­న్న­ర­కు చే­రిం­ది. పీ­జే­ఆ­ర్ ప్ర­తి­ప­క్ష నే­త­గా ఉన్న సమ­యం­లో ఖాళీ కుం­డ­ల­తో అసెం­బ్లీ ముం­దు ధర్నా­లు చేసి.. మం­జీ­రా, కృ­ష్ణా జలా­ల­ను హై­ద­రా­బా­ద్ తర­లిం­చా­రు. రా­జ­శే­ఖ­ర్ రె­డ్డి సీ­ఎం­గా ఉన్న­పు­డు శ్రీ­పాద ఎల్లం­ప­ల్లి నీ­టి­ని తర­లిం­చ­డా­ని­కి శం­కు­స్థా­పన చే­స్తే 2014 నుం­చి నగ­రా­ని­కి వచ్చా­యి’ అని సీఎం రే­వం­త్ తె­లి­పా­రు.

 పీజేఆర్ పోరాటంతోనే...

ఉమ్మ­డి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఎం­డ­కా­లం వచ్చిం­దం­టే సచి­వా­ల­యం ముం­దు ని­స­ర­న­లు హో­రె­త్తే­వ­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. నాడు పీ­జే­ఆ­ర్ పో­రా­టం­తో­నే మం­జీ­రా జలా­లు నగ­రా­ని­కి వచ్చా­య­ని గు­ర్తు చే­శా­రు. 2002లో కృ­ష్ణా జలా­లు హై­ద­రా­బా­ద్‌­కు తర­లిం­చా­ర­ని గు­ర్తు చే­శా­రు. వై­ఎ­స్ఆ­ర్ హయాం­లో శ్రీ­పాద ఎల్లం­ప­ల్లి నుం­చి నగ­రా­ని­కి తర­లిం­చా­ర­ని పే­ర్కొ­న్నా­రు. గో­దా­వ­రి తల­పైన చల్లు­కు­న్నంత మా­త్రాన.. చే­సిన పా­పా­లు పో­వ­ని మాజీ మం­త్రి హరీ­శ్ రా­వు­ను ఉద్దే­శిం­చి సె­టై­ర్లు వే­శా­రు. హై­ద­రా­బా­ద్ దాహం తీ­ర్చిం­ది కాం­గ్రె­స్ ప్ర­భు­త్వా­లే­న­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. గో­దా­వ­రి నదీ జలా­ల­ను మూసీ నది, ఈసా నది­లో సమ్మే­ళ­నం చేసి నగర ప్ర­జల దా­హా­ర్తి­ని తీ­ర్చు­తా­మ­న్నా­రు. హై­ద్రా­బా­ద్ నగ­రం­కు ప్ర­పంచ దే­శా­ల్లో గొ­ప్ప పే­రుం­ద­ని... 1908లో నగర ప్ర­మా­దా­న్ని ని­వా­రిం­చ­డా­ని­కి ని­జాం సర్కా­ర్ ఉస్మా­న్ సా­గ­ర్, హి­మా­య­త్ సా­గ­ర్ ప్రా­జె­క్టు­ల­ను ని­ర్మిం­చా­రు. మూసీ నది ము­రి­కి కూ­పం­గా­నే ఉం­డా­ల­ని అని సీఎం రే­వం­త్ రె­డ్డి ప్ర­శ్నిం­చా­రు. గంగా, యము­నా, సబ­ర్మ­తీ నదు­లు మా­త్ర­మే ప్ర­క్షా­ళన కా­వా­లా..? అని కేం­ద్రా­న్ని ని­ల­దీ­శా­రు. పదే­ళ్ల బీ­ఆ­ర్ఎ­స్ పా­ల­న­లో కే­సీ­ఆ­ర్ మూసీ ప్ర­క్షా­ళన గు­రిం­చి ఎం­దు­కు ఆలో­చిం­చ­లే­ద­ని అన్నా­రు.

Tags:    

Similar News