REVANTH: ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం

తెలంగాణలో మరో రెండు ఎయిర్‌పోర్టులు.. సన్న బియ్యం పథకం ఓ సంచలనం.. స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి;

Update: 2025-08-16 03:00 GMT

మహ­నీ­యుల స్ఫూ­ర్తి­తో తె­లం­గా­ణ­ను అగ్ర­ప­థం­లో ని­లి­పేం­దు­కు కృషి చే­స్తు­న్నా­మ­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం సా­హ­సో­పేత ని­ర్ణ­యా­ల­తో ముం­దు­కు సా­గు­తోం­ద­ని అన్నా­రు. ప్ర­పంచ నగ­రా­ల­తో పో­టీ­ప­డే ని­ర్ణ­యా­ల­తో ముం­ద­డు­గు వే­స్తు­న్నా­మ­ని.. పేదల సం­క్షే­మం­లో సరి­కొ­త్త చరి­త్ర రా­స్తు­న్నా­మ­ని అన్నా­రు. సం­క్షే­మా­ని­కి కే­రా­ఫ్‌ అంటే కాం­గ్రె­స్‌ పాలన అని తె­లి­పా­రు. 79వ స్వా­తం­త్ర్య ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా గో­ల్కొండ కో­ట­లో జా­తీ­య­ప­తా­కా­న్ని ము­ఖ్య­మం­త్రి ఆవి­ష్క­రిం­చా­రు. దే­శం­లో ఎక్క­డా లే­ని­వి­ధం­గా 3.10 కో­ట్ల మం­ది­కి సన్న­బి­య్యం ఇస్తు­న్నా­మ­న్న రే­వం­త్.. సన్న బి­య్యం పథకం కే­వ­లం ఆక­లి­తీ­ర్చే పథకం కా­ద­ని... పేదల ఆత్మ­గౌ­ర­వా­ని­కి ప్ర­తీ­క­ని అన్నా­రు. ప్ర­జా ప్ర­భు­త్వం వచ్చా­కే పేదల సమ­స్య­లు పరి­ష్కా­రం అవు­తు­న్నా­య­న్న సీఎం... రే­ష­న్‌­షా­పు­లు పే­ద­వా­డి ఆక­లి­తీ­ర్చే భరో­సా కేం­ద్రా­లు­గా మా­రా­య­న్నా­రు. గతే­డా­ది ఆగ­స్టు 15న రూ.2 లక్షల రు­ణ­మా­ఫీ­కి శ్రీ­కా­రం చు­ట్టా­మ­న్న ము­ఖ్య­మం­త్రి రే­వం­త్... రై­తు­ల­కు ఇచ్చిన మాట ని­ల­బె­ట్టు­కు­న్నా­మ­ని... వి­త్త­నా­లు వేసే నా­టి­కి రై­తుల ఖా­తా­ల్లో రైతు భరో­సా వే­శా­మ­న్నా­రు.

మూసీ పునరుజ్జీవంతో...

" మూసీ పు­న­రు­జ్జీ­వ­నం­తో హై­ద­రా­బా­ద్‌ వర­ద­కు పరి­ష్కా­రం చూ­పు­తాం. హై­ద­రా­బా­ద్‌ గేట్ వేతో తె­లం­గాణ ము­ఖ­చి­త్రా­న్ని చా­టి­చె­ప్తాం. బా­పూ­ఘా­ట్‌­ను గాం­ధీ సరో­వ­ర్‌ పే­రు­తో అభి­వృ­ద్ధి చే­స్తాం. మనకు శం­షా­బా­ద్‌ వి­మా­నా­శ్ర­యం ఒక్క­టే ఉంది. త్వ­ర­లో­నే వరం­గ­ల్‌, ఆది­లా­బా­ద్‌­కు కొ­త్త ఎయి­ర్‌­పో­ర్టు­లు రా­ను­న్నా­యి. హై­ద­రా­బా­ద్‌-బెం­గ­ళూ­రు కా­రి­డా­ర్‌­లో కీలక ప్రా­జె­క్టు­లు ని­ర్మి­స్తాం. హై­ద­రా­బా­ద్‌­ను శు­భ్ర­మైన, సౌ­క­ర్య­వం­త­మైన నగ­రం­గా మా­రు­స్తాం. శు­భ్ర­మైన నగ­ర­మే లక్ష్యం­గా ఏర్పా­టు చే­సిం­దే హై­డ్రా వ్య­వ­స్థ” అని రే­వం­త్ తె­లి­పా­రు.

Tags:    

Similar News