హైదరబాద్ నగరంలోని కుషాయిగూడ ఏఎస్రావునగర్లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ప్రజలు చూస్తుండగానే రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. రోడ్డు కుంగడంతో వాహనదారులు ప్రమాదానికి లోనవకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్ను దారి మళ్లించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు కుంగిన రోడ్డును పరిశీలించారు.