సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఓ వైపు దుమారం చెలరేగుతుండగా… మరోవైపు అంబర్పేట మహంకాళి ఆలయంపై రాళ్ళ దాడి జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మహంకాళి ఆలయంపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. ఆలయ ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడని, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.