TG : డిసెంబర్ 9న తెలంగాణ బంద్‌కు పిలుపు

Update: 2024-12-06 14:15 GMT

ఈనెల 9న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. పోకలమ్మ వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఏడుగులు మావోయిస్టులు మృతి చెందారు. ఇక అటు ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై తమకు అనుమానాలు ఉన్నాయని... ఫేక్ ఎన్ కౌంటర్లు ఎప్పటికైనా తప్పేనని.. గతంలో కేసీఆర్ కూడా ఎన్ కౌంటర్లను ఒప్పుకోలేదన్నారు జగదీశ్ రెడ్డి.

Tags:    

Similar News