10TH Student Heart Attack : స్కూల్కు వెళ్తూ గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లికి చెందిన టెన్త్ విద్యార్థిని శ్రీనిధి(14) హార్ట్ అటాక్తో చనిపోయింది. కామారెడ్డిలో పెద్దనాన్న ఇంట్లో ఉండి చదువుకుంటున్న ఆమె నడుచుకుంటూ స్కూల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే టీచర్లు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని మృతి చెందడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.
హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి వెంటనే సీపీఆర్ మొదలు పెట్టి, ఇతరులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వాలి. అది వచ్చేలోగా సీపీఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి టెనెక్ట్ప్లేస్ ఇంజక్షన్ ఇస్తే ప్రాణాలు నిలుస్తాయి. కానీ ఇదంతా కేవలం గంట లోలే జరిగిపోపాలి.