KCR : కేసీఆర్ తెలంగాణ డే సందర్భంగా ఇచ్చిన సందేశం ఇదే

Update: 2025-06-02 08:45 GMT

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాం క్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో దోపిడికి గురైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం యావత్త్ సమాజాన్ని మెలుకొలిపి ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కేసీఆర్ అన్నారు. శాంతియుతంగా పార్లమెంటరీ పంథా లో కొట్లాడి స్వరాష్ట్రానికి ఊపిరిపోశామని వివరించారు. సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని కేసీఆర్ వివరించారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశ గా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయా లని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని స్పష్టం చేశా రు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంట లతో వర్థిల్లుతూ, రైతులు సబ్బండ కులాలు, సకలజనులు సుఖ సంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News