TG : కేసీఆర్‌తో కార్యకర్తల భేటీకి మూడు రోజులు బ్రేక్

Update: 2024-06-29 09:34 GMT

కేసీఆర్ ( KCR ) గత 15 రోజులుగా ఎర్రవెల్లిలో నిరంతరాయంగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ తెలిపింది. ఆయనతో ప్రజల ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పార్టీ నేతలతో కీలక సమావేశాలున్న నేపథ్యంలో పార్టీ నుంచి మరో ప్రకటన వచ్చే వరకూ ఎవరూ తనను కలవడానికి రావొద్దని కేసీఆర్ కోరారని పేర్కొంది.

పార్టీని వీడి దొంగలతో కలిసినోళ్ల గురించి తనకు బాధ లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కనా? పార్టీనే నాయకులను తయారు చేస్తుంది. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తాం. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం’ అని గులాబీ దళపతి వ్యాఖ్యానించారు.

. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని తెలిపారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్‌ రెడ్డి, జాజాల సురేందర్‌, గంప గోవర్దన్‌, హన్మంత్‌ షిండే, ఎల్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News