వరద నియంత్రణకు ఏడేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో చిత్తు కాగితం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన హామీ ఏమైందని ప్రశ్నించారు. సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ హామీ గతంలోనే ఇచ్చినా... ఎందుకు అమలు చేయలేదని అన్నారు. హైదరాబాద్లో వరద నియంత్రణకు ఏడేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మోసపూరిత మాటల్ని హైదరాబాద్ ప్రజలు గమనించాలని అన్నారు.