Harish Rao : కాంగ్రెస్, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి : హరీష్ రావు
Harish Rao : కాంగ్రెస్, బీజేపీ.. వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్రావు.;
Harish Rao : కాంగ్రెస్, బీజేపీ.. వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్రావు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇంతపెద్ద వరదలు వచ్చినా కేంద్రం ఒక్క పైసా ఇవ్వడం లేదని ఆరోపించారు.
6 నెలల్లో స్వచ్ఛ సంగారెడ్డిని అందిస్తామని మంత్రి హరీష్రావు తెలిపారు. 500 కోట్ల రూపాయలతో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు.. అర్హులందరికీ రేషన్కార్డులు ఇస్తామని హరీష్రావు హామీ ఇచ్చారు.