తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీస్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీస్లోని పలు అంశాలకు కౌంటర్ ఇచ్చిన రేవంత్.. లీగల్ నోటీస్ను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరఫునే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీకి సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందన్న రేవంత్.. అలాంటప్పుడు కేటీఆర్కు సంబంధం లేదని ఎలా చెప్తారని ప్రశ్నించారు. పేపర్ లీక్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందన్నారు రేవంత్.