గోదావరినదిలో చిక్కుకుపోయిన ఇద్దరు రైతులు

నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులు గోదావరినదిలో చిక్కుకుపోయారు. ఖానాపూర్ మండలం సదర్మట్ ప్రాంతంలో... నదిమధ్యలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం..;

Update: 2020-10-16 06:08 GMT

నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులు గోదావరినదిలో చిక్కుకుపోయారు. ఖానాపూర్ మండలం సదర్మట్ ప్రాంతంలో... నదిమధ్యలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన కూస మల్లయ్య, చిలువేరు తిరుపతిగా గుర్తించారు. వీరిని గుర్తించిన స్థానికులు తాళ్లసహాయంతో ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులకు సమాచారం అందించిన స్థానికులు...తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

Tags:    

Similar News